2016/03/22

ఎందుకు కుటుంబం కుంటుపడుతుంది?

|| జై శ్రీమన్నారాయణ || 

అసలు విషయానికొస్తే ...
ఒక ఉన్నతాధికారికి ప్రభుత్వం ఎందుకు డ్రైవర్ ని, కారుని, నౌకరుని ఏర్పాటు చెస్తుంది?...ఏం, తనపని తాను చేసుకోలేడా? తనకి డ్రైవింగ్ రాదా? కారు కొనుక్కోలేడా? అని మనకు అనిపించొచ్చు. కాని నిజానికి ఆ ఉన్నతాధికారి తన స్వంతపనులన్నీ తనకి తాను సమాంతరంగా చేసుకుంటూ పోతే.. ప్రభుత్వపరంగా తాను చేయ వలసినపనిలో "ఉత్పాదకత" (productivity) - "నాణ్యత" (quality)తగ్గి పోతాయి..పనులు కుంటుపడతాయి..నిజానికి ఇది చాలా ప్రధానవిషయం.
కుంటుంబ యజమాని కూడా తన స్వంతపనులు తాను చేసుకుంటూ, పోషణ - భద్రత- సౌకర్యాల వంటి భాద్యతలు కూడా సమాంతరంగా నిర్వహించుకుంటూ పోవడంవల్ల కుటుంబ " అభివృద్ది " "ఉత్పాదకత" - "నాణ్యత" తగ్గిపోతాయి. కుటుంబం కుంటుపడుతుంది... మన పెద్దలు మూర్ఖులు కారు.. జ్ఞానవంతులు. అర్థంచేసుకోండి.
అలాగే జ్ఞానం-సబ్జెక్టు ఉన్న ఒక ఇంటెలెక్చువల్ విషయం లో కూడా ఇదే జరుగుతుంది ... అలాంటి వారికి ఇండియాలో గురువులంటారు లెండి. నిజానికి వారికి ఎవ్వరీ సేవా అవసరం ఉండదు. వారిని సేవించడం అనేది మన అవసరం.
కుంటుంబ జయమాని చేతనైనంత ఎక్కువ సమయం కుంటుంబ వృద్దికోసం కేటాయించేలా అతనికి, 1) సేవతో సహకరించడం,2) కృతజ్ఞతతో ప్రోత్సహించడం అనేది పూర్తి కుంటుంబసభ్యుల బాధ్యత. అంతేకాదు అది కుంటుంబసభ్యుల "ప్రధాన కర్తవ్యం" ..
అర్థం చేసుకున్న వాళ్ళు సహకరిన్స్తున్నారు. పెడార్థాలు తీసే వారు నాశనం చేసుకుంటారు.

ఇదే విషయాన్నే చాగంటి గారు ఇటీవల చెప్పారు... మనం ఇంకోలా అర్థంచేసుకుంటున్నాం. .
భార్య, భర్త బట్టలు ఉతకడం అనేది తాను కుంటుంబానికిచ్చే సహకారం. సేవకి-ఊడిగానికి చాలా తేడా ఉంటుంది. 

మనం నాగరికులం, అడివిలో బ్రతకట్లేదు కదా .
అడవిలో మనకి ముసలిజంతువులు, అనారోగ్యమైన జంతువులు కనబడవు. ఎందుకంటే ఆడవిలో బలహీణమైనవి బతకలేవు. ఎందుకంటే వాటికి కుంటుంబం -సేవ అనే కాన్సెఫ్ట్ ఉండదు. అవి వివశతతో బతికేవి. అలోచించండి.

కాని సమాజం వేరు, మనమిక్కడ సంఘజీవులం. మనిషి కుటుంబవ్యవస్థని ఏర్పరుచుకొని పరస్పరం కుంటుంబసభ్యుల సేవ-సహకారాలతో జీవనప్రమాణాన్ని, నాణ్యతని పెంచుకుంటూ వచ్చాడు. ఇది కొన్ని వందల వేల సంవత్సరాలనుండి వస్తున్న "పరంపర".

కుంటుంబం వ్యక్తుల ఆర్థికస్వావలంబనతో నడుస్తుంది అనడం మూర్ఖత్వం.
నిజానికి కుంటుంబం ఉనికి రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది.
1 సేవ 2 కృతజ్ఞత
1 సేవ : ప్రతిఫలం ఆశించక ఎదుటివారి మేలుకోరి చేసిపెట్టే పనిని సేవ అంటారు.
కుంటుంబంలో ఒకరిపట్ల ఒకరికి సేవాభావం ఉండాలి.
అనారోగ్య పరిస్తితుల్లో మనమన కుటుంబసభ్యుల సేవని ఎలాగో చేస్తాము.
కాని
లేత పసిపిల్లల మలమూత్రాలు శుభ్రంచేసి, ఆహారం అదించడం ఎంత అవసరమో ,
పండు ముసలివారి మలమూత్రాలు శుభ్రంచేసి, ఆహారం అదించడం అంతే అవసరం..ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ అవసరం.
దానిలోని గొప్పతనం, హుందాతనం, సంతృప్తి, కేవలం ఆ సేవచేసే వారికే తెలుస్తుంది. అసహ్యించుకునే-చీదరించుకునె- తప్పించుకునే పనికిమాలినవారికి ఇది అర్థంకాదు. ఇది నిజం.
కుంటుంబంలో సేవకి పెద్ద-చిన్న తేడాలేదు. కాని, వయసూ వారి సమర్థతని దృష్టిలో ఉంచుకొని సేవలు చేయడమో లెదా చేయించూకోవడమో చేయాలి. పరస్పర ప్రేమాభిమానాలు ముఖ్యం.

2) రెండవది కృతజ్ఞత : కుంటుంబం యొక్క ఉనికిపై, కుంటుంబసభ్యులు నిర్వర్తిసున్న బాధ్యతలపై స్పృహ కలిగి ఉండడాన్ని కృతజ్ఞత అంటాం .
సేవ చేయించుకునే వారు సేవచేసే వారిపట్ల అలాగే, సేవచేసే వారు చేయించుకునె వారిపట్ల. పరస్పరమూ స్పృహతొ - కృతజ్ఞతతో మెలగడం అతి ముఖ్యమైన విషయం.
కృతజ్ఞతని వదిలి కేవలం సేవని ఆశించినా..
సేవని వదిలి కేవలం కృతజ్ఞతని ఆశించినా.. అది కుంటుంబాన్ని దెబ్బ తీస్తుంది. అది దుర్మార్గం కూడా.
ముఖ్య విషయం, కృతజ్ఞత లేదా సేవ లోపిస్తే గుర్తు చెయాల్సిన బాధ్యత ఇంటి పెద్దలది..కాని వారికి ఆదరణ కరువైంది.
పై రెండూ లేకనే కదా..
ఇప్పుడు కుంటుంబాలు పెద్దలు లేని అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య లాంటి పదాలు వినపడని " మైక్రో ఫ్యామిలీస్" తయారవుతున్నయి .
మంచి చెప్పేవారు లేని కౌన్సిలింగ్ మీద ఆధారపడే "నానొ ఫ్యమిలీస్ " తయారవుతున్నాయి .
జంటలు పెళ్లైన రెండేళ్లకే విడాకుల దాకా పరిగెత్తే పరిస్తితులు తయారవుతున్నాయి .
వృద్దాశ్రమాలకి డిమాండులు పెరిగిపోతున్నాయి.
మానసిక చికితల ప్రాధాన్యాలు పెరిగిపోతున్నయి.
ధనం అవసరం నుండి అత్యవసరంగా మారిపోయింది.
కుటుంబంలో రాజకీయ నాయకులజోక్యం , ఇతర సంస్థలజోక్యం, బయటి వ్యక్తులజోక్యం ఎక్కువపైపోతున్నాయి.

నిజానికి మనసేవ మీద ఎవ్వరు అధారపడి లేరు.. ఎందుకంటే మనబ్రతుకు ఎదుటివాడు బ్రతకలేడు.. అలాగే ఎదుటివారి చావు మనం చావలేము...
సేవ చేసినా చేయక పోయినా జరగాల్సినవి జరుగుతాయి... నష్టపోయేది నిజానికి మొత్తం కుటుంబమే. అదే నిజానికి " దరిద్రం" అంటే.
సేవ విషయంలో మనకు శ్రీకృష్ణుడే ఆదర్శం :
తనని కలుసులోవడానికి ఎన్నో మైళ్ల దూరమ నుండి నడచి వచ్చిన నిరుపేద కుచేలున్ని సాదరంగా ఆహ్వనిన్చి . అలసిన పాదాల మధ్య లో ఇరుక్కుఇ పోయిన రాళ్లని, ముళ్లని తీసి , ఆ పాదలని కడిగి, ఆ జలాన్ని తలమీద చల్లు కొని , భార్య తలమీద కూడా చల్లి. కడుపునిండా భోజనం పెట్టి విధ్యామరలతో "నిశ్చింతుడయ్యెంత వరకూ" సేవ చేసిన శ్రీకృష్ణుడే ఈ విషయం లో మనకి ఆదర్శం.
చేతివ్రేళ్లు తెగిపోయిన కుష్టిరోగుల గాయాలని రోజూ శుభ్రం చేసి సేవ చేసుకున్న గాంధీ మనకి ఆదర్శం.
మనం పుట్టుకకు తరవాత మన అమ్మకి పచ్చి బాలింత-సేవలు చేసిన మన అమ్మమ్మ-నాన్నమ్మలు మనకి ఆదర్శం
మనకు దెబ్బతగిలితే కళ్లలో నీళ్ళు , ఆకలైతే గుండెలో పాలు తెచ్చుకున్న అమ్మ సేవ మనకి ఆదర్శం.
వారందరి పాదధూలి నా శిరస్సు పై సదా ఉండు గాక.
సేవతోనే మనుషులు సరళులవుతారు, తేలికవుతారు, పునీతులవుతారు, సంతృప్తి పొందుతారు, ప్రయోజకులవుతారు, పవిత్రులవుతారు, తరించి పోతారు. ఇది నగ్న సత్యం.
స్వస్తి!
-సత్య  

No comments:

Post a Comment